BCCI Gift: టీమిండియా ఆటగాళ్లకు BCCI భారీ నజరానా..!

2026 ఐసీపీ పురుషుల టి20 ప్రపంచ కప్‌లో విజయం సాధించిన తర్వాత భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) భారత జట్టుకు 131 కోట్ల రూపాయల నగదు బహుమతిని ప్రకటించింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను ఓడించి భారత్ ప్రతిష్టాత్మక ట్రోఫీని కైవసం చేసుకుంది. టైటిల్‌ను విజయవంతంగా నిలబెట్టుకుంది, టోర్నమెంట్ చరిత్రలో టి20 ప్రపంచ కప్‌ను నిలబెట్టుకున్న తొలి జట్టుగా నిలిచింది. ఈ విజయంతో, ఐసిసి పురుషుల టి20 ప్రపంచ కప్‌ను మూడుసార్లు గెలుచుకున్న తొలి జట్టుగా భారత్ నిలిచింది, ఈ ఫార్మాట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్టుగా భారత్ నిలిచింది.

ehatv

ehatv

Next Story